మహా ప్రస్థానం – శ్రీశ్రీ


 తనకు రావలసిన వేజ్ రివిజన్ బకాయి పడిందని ప్రభుత్వం మీదా..
మేడ మీద మరో రెండు గదులు వేయడానికి ప్లాన్ కోసం వెళ్తే వెయ్యి నూట పదహార్లు లంచం అడిగాడని ఒక క్లర్కు మీదా.. 
పది నిమిషాలు లేటుగా వెళ్ళిసమయ పాలన లేనితనమనే జాతీయ రుగ్మతతో బాధ పడుతున్న దేశం మీదా ..
అప్పుడప్పుడు ఆగ్రహించడం తప్ప జీవితంలో వేరే  కంప్లైంట్సూ లేని మనకి ..
రాబందుల రెక్కల చప్పుడూ .. పయోధన ప్రచండ ఘోషఝంఝానిల షడ్జధ్వానాలు .. వినిపిస్తాయా !

కానీ అతడికి వినిపించాయివిన్నాక మనకి చెప్పించాయిఅదే మహా ప్రస్థానం.

               శ్రీశ్రీ రాయడంకోసమే పుట్టినవాడు., రాయడం కోసమే బ్రతికిన వాడురాయడంకోసమే జరారుజులను జయించినవాడు.  అక్షరాలనే ఆస్థిగా నమ్ముకునిఅక్షరాల కోసమే వాటిని అమ్ముకున్నవాడు.. ఆయన వ్రాసిన "మహాప్రస్థానంప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయనక్కరలేదుఅయినా మరోసారి పరిచయం చేసే సాహసం చేస్తున్నాం కార్మిక వాహిని పాఠకుల కోసం.

                      
ఒక తరపు యువకులను మహోత్తేజంతో ఊపేసిన రచన మహా ప్రస్థానం క్షణాన అది సాహిత్య ప్రపంచం లోకి వచ్చిందో తెలియదు గానీ తర్వాత  పుస్తకం చేరిన మహోన్నత స్థానం ఎప్పటికీ మారలేదు .  ఒక తరంలో చాలా మంది యువకుల చైతన్యంలో అది ఇంకిపోయిందివాళ్ళ ప్రపంచంలో ఒక్కటైందిఒక ఆప్తుడైన నేస్తమయింది.  దుఃఖమొచ్చినప్పుదు ఓదార్చింది . దిగులుకలిగినపుడు భరోసానిచ్చిందిఒక్కటేమిటి సర్వకాల సర్వావస్థలందూ వెన్నంటే ఉందిమహా ప్రస్థానంతో పాటు చలం ముందు మాటగా రాసిన “యోగ్యతా పత్రం” కూడా.  

                          ఎవరికయినా  ప్రపంచం మరింత అర్థమవుతున్న కొద్దీ , జీవితానుభవం పెరుగుతున్నకొద్దీ మహాప్రస్థానం మరింత దగ్గరవుతుందిఒక్క “ గర్జించు రష్యా” పద్యం తప్ప మహా ప్రస్థానంలో అన్ని పద్యాలూ ఇప్పటికీ ,  కాలానికీ అన్వయించుకోదగ్గవే ! ప్రాసంగికమే !! అధునికత నుండి మనుముందుకు ప్రయాణిస్తున్న మనం వాటిని ఇప్పటికీ అన్వయించుకోగలంఅందుకే అవి నవవోన్మేషం.అలాగే చలం ముందు మాటలో అనేక వ్యాక్యాలు – మహా ప్రస్థాన పద్యాలతో కలసి మనకు జీవిత సారాన్ని కొత్తగా పరిచయం చేస్తూ ఉంటాయి.     

తెలుగు కవిత్వానికి ఒక వినూత్నవిభిన్న దిశా నిర్దేశం చేసిన మహా కవి శ్రీశ్రీ . 1930-1940 మధ్య కాలంలో వ్రాసిన “ మహా ప్రస్థానం” లోని కవితలు ఒక బలీయమైన నిరసనలోంచి వచ్చినవి నిరసన ఒక సాంద్రమైన  Deeply felt emotion..ఇది ఒక తాత్విక చింతనననుసరించి వచ్చిన నిరసన కాదు.  అంతక్రితం వరకూ వచ్చిన , వస్తున్న కవిత్వం సమాజంలో తాడితుల , పీడితుల వేదనలకుస్పందించకుండా ఉండడంపై వచ్చిన నిరసనఅందుకే మహా శక్తివంతంగా వెల్లువలా జ్వాలలా వచ్చిందిఅందుచేతనే యోగ్యతా పత్రంలో చలం అన్నట్లు  సంకలనం లోని కవితలు కత్తులుగాఈటెలుగా,  మంటలుగా,  బాధలుగాతిరుగుబాట్లుగాయుద్ధాలు గా బహిర్గతమయాయిశ్రీశ్రీ మరోప్రపంచాన్ని కలగన్నాడుమరోప్రపంచం అంటే  ఏదో స్వర్గం కాదుమనం చచ్చిపోయాక చేరుకొనే లోకం కాదుమనంబ్రతికున్నప్పుడు సాధించుకోవాల్సిన  కొత్త  ప్రపంచంపేదరికందోపిడిఅకలిచావులుఅనాధలుపతితులుభ్రష్ఠులుబాధా సర్పద్రష్టులు లేనిఅసమానతలు లేని ప్రపంచం.  

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది.. 
పదండి ముందుకు పదండి త్రోసుకు , పోదాం పొదాం పైపైకి..
... దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు..
బాటలు నడచి పేటలు కడచీ కోటలన్నిటిని దాటండి..
 నదీ నదాలూ ., అడవులు కొండలు.. ఎడారులా మనకడ్డంకి ?” 

అంటాడు శ్రీశ్రీ.,
ఎడారులా మనకడ్డంకి అనడంతోనే అడ్డంకులేవీ నిజానికి ఒక విప్లవకారుని ఆపలేవని స్ఫురింపచేయదం ధ్వని ప్రాయంగా జరుగుతుందిఇంకా అదే కవితలో “ త్రాచుల వలేనూ  రేచులవలెనూ ధనుంజుయినిలా సాగండి. “ లాంటి పద చిత్రాలతో  సంకలనానికి ధ్యేయదిశా నిర్దేశం చేస్తుంది..

అలాగే జయభేరి లో చక్కనిచిక్కని ఉర్రూతలూగించే కవితా ప్రస్థానం సాగుతుంది.
 “ నేను సైతం
ప్రపంచాగ్నికి
 సమిధనొక్కటి
 ఆహుతిచ్చాను.
నేను సైతం ప్రపంచాబ్జపు
 తెల్లరేకై
 పల్లవిస్తాను.
నేను సైతం
భువన భవనపు
బావుటానై
పైకిలేస్తాను “
 అంటాడు శ్రీశ్రీ

            ఒకానొక సందర్భం లో శ్రీశ్రీ మహా ప్రస్థానానికి నామాట వ్రాస్తూ అంటారు.”  వాస్తవాలన్నింటికీ నేను స్పందించినాఇలాంటి రచనలను “ సామాజిక వాస్తవికత” అంటారనీ., దీనికి వెనుక దన్నుగా “ మార్క్సిజం” అనే దార్శనికత ఒకటి ఉంటుందని అప్పటికి నాకు తెలియదు”. నామాట ముగిస్తూ శ్రీశ్రీ ఇలా అంటారు.”మహా ప్రస్థానం లో అభ్యుదయ కవిత్వం విప్లవ బీజాలు ఉన్నాయివిప్లవ సాహిత్యంలేదు” . అని.. అప్పటికి మార్క్సిజం గురించి శ్రీశ్రీ కి తెలియదంటే అతిశయోక్తిగా అనిపించవచ్చు గానీ తెలిసినా .. తెలియకపోయినా తనచుట్టూ ఉన్న సమాజపు స్థితిగతులకు చిత్తశుద్ధితో , ఆర్ధ్రమయిన హృదయంతో స్పందించి వ్రాయబట్టే తన భావుకతకు తోడుగా గొప్ప శబ్ద శక్తిఅనుభూతినిజతత్వ నిరూపణవ్యక్తీకరణ మాధ్యమాలుగా శక్తివంతమైన పదచిత్రాలను వాడబట్టే మహాప్రస్థానం ఎన్నటికీ మరువలేనికవిత్వం అయింది.

మహాప్రస్థానంలో ఎప్పుడు చదివినా కొత్తగా మనల్ని ఆవిష్కరించుకోనే కవిత “ వ్యత్యాసం”.

అదృష్టవంతులు మీరు
వెలుగుని ప్రేమిస్తారు
ఇరులను ద్వేషిస్తారు 
మంచికీ చెడ్డకీ నడుమ
కంచుగోడలున్నాయి మీకు
మంచిగదిలోనే
సంచరిస్తాయి మీ ఊహలు
ఇదివరకే  ఏర్పడిందా గది..
అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం..”

అంటూ..

“ అభాగ్యులం మేము,
సరిహద్దులు దొరకని
సంధ్యలలో మా సంచారం
అన్నీ సమస్యలే సందేహాలే మాకు..
వెలుగులోని చీకట్లే ,
ఇరులలోని మిణుగురులే చూస్తాం.
....
వ్యత్యాసాలు , వ్యాఘాతాలే మాకు"
అని ఇంకా ఇలా అంటాడు.
అలజడి మా జీవితం
అందోళన మా ఊపిరి,
తిరుగుబాటు మావేదాంతం.
ముళ్ళూ రాళ్ళూ అవాంతరాలెన్ని ఉన్నా
ముందు దారి మాది ..
అందుకే
ముదుకు పోతాం మేము
ప్రపంచం మా వెంట వస్తుంది.
తృప్తిగా చచ్చిపోతారు మీరు
ప్రపంచం మిమ్మల్ని మర్చిపోతుంది."

 కవిత ఒకసారి కాదు వంద సార్లు చదవాలి.
చదివిన ప్రతీసారి మనసుని ఉద్వేగంగా చుట్టేసే భావాలున్నాయి ఇందులో.

                   ప్రశ్నలు ప్రశ్నలు సమాధానాలు సంతృప్తి పరచనిజీవితాలలో సరిహద్దులు దొరకని సంధ్యలలో సంచరించే మనుషులకూ మధ్య తేడాను చాలా మామూలుగా అనిపించే పదాలతో తాను ఎంచుకొన్న వస్తువులోని ఉద్వేగాన్ని భాషలో ప్రవేశపెట్టకుండా వచనంలా అనిపించేటట్లు రాసి ఒక విశ్వజనీన తాత్విక కవితాత్మకతను సాధించారు శ్రీశ్రీముఖ్యంగా ముందే ఏర్పరుచుకున్న సరళరేఖాకొలమానాలతో బేరీజు వేసి తీర్పులిచ్చేసి అధికారాన్ని చలాయించే అన్నిరకాల వ్యవస్థీకృత అధికార ఆలోచనల మీద వాటి పొరలపొరల ఆధిపత్య యంత్రాంగాల మీద చావుదెబ్బ కొట్టాడుగోడలు లేని జీవితాలని గోడలు పగలగొట్టటమే మాపని అని స్పష్టంగా నీళ్ళు నమలకుండా చెప్పివ్యవస్థలో మార్జినలైజ్ అయినవాళ్ళ మేనిఫెస్టో ని ప్రకటించాడు
  
భావానికి అనుగుణంగా పదాలని కదం తొక్కించే కవాతు విద్య మనం మహాకవి శ్రీశ్రీ లో చూస్తాంమహాప్రస్థానం నిండా ఇందుకు ఉదహరణలు కోకొల్లలు.  
కదంత్రొక్కుతూపదం పాడుతూహృదంతరాళం గర్జిస్తూ మరోప్రపంచపు జలపాతాలనుదారిపొడుగునా తర్పణ చేసే గుండె నెత్తురులనుబాటలు పేటలు కోటలునదీ నదాలుఅడవులు కొండ దారులు తోసి రాజనుకుంటూ ముందుకు ముందుకు పైకి పైకి దూసుకు పోవాలంటే ఎముకలు కుళ్ళిన .. వయస్సు మళ్ళిన సోమరుల వల్ల కాని పని కనుక.. నెత్తురుమండే శక్తులు నిండే సైనికుల్లాంటి యువతమాత్రమే " హరోం హరోం హర!! హరహర హరహరఅంటూ ప్రభంజనంలా ముందుకురకాలని కోరుకున్నారు శ్రీశ్రీ.  

అందుకే ఆయన మహా ప్రస్థానం జయభేరితో బయలుదేరి ప్రతిజ్ఞలెన్నో చేసింది.
 హలాలతో పొలాలు దున్నింది!
 అవిశ్రాంతంగా అలుపెరుగని కార్మికుడి కోసం కర్షకుడి కోసం పరుగులు తీసింది.
 యంత్రాల కోరల్లో భూస్వాముల పాదాల క్రింద పడి నలిగిపోయిన పేదరికాన్ని చూసి మండిపడింది.

అచేతనులను చేతనులుగా మార్చింది.
 పనివాడి కన్నీటి భారాన్ని  పంచుకుంది.
 దారి వెంబడి సాగిపోయే జగన్నాధ రధచక్రాలతో సవాలు చేసింది.
 భీకర గర్జనలతో దిక్కులన్నీ బెదిరిపోయేలా చేసింది.

కార్మికుడి కన్నీటిని పన్నీరుగా మార్చటానికి మౌన పోరాటాలు చేసింది
విప్లవగీతాలు ఆలపించింది.
ఎన్నో ఆశలతో పల్లె వదిలి వచ్చి నిలువునా కూలిపోయిన బాటసారిని చూసిన తల్లి పేగులా తల్లడిల్లింది.
ఉడుతలతోటి బుడుతలతోటి శైశవగీతాలు పాడుకుంది.

మనమూ మనుషులమేనా !
మనదీ ఒక బతుకేనా కుక్కలవలె నక్కలవలె.. సందులలో పందులవలె
అంటూ నశించిపోతున్న మానవతా విలువల్ని గురించి మౌనంగా రోదించింది.
భూస్వాముల రక్కసి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న బలహీనుడి గుండెకు కొత్త ఊపిరి పోసానని మహా ప్రస్థానం  బహుశా ఎంత సంతసించి ఉంటుంది!!!!
     అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పేమీ లేదని తెలిస్తే .. తాను రాసినవన్నీ నీటి మీద రాతల్లా తేలిపోతున్నాయని తెలిస్తే శ్రీశ్రీ ఆత్మ నిస్సహాయంగా రోదిస్తుందేమో ఇప్పుడు.

గళమెత్తికలమెత్తి గర్జించే మేధావులారా ! బీటలు వారిన మహా ప్రస్థానపు హృదయాన్ని నిమరండినీ వెంటే మేమంటూ ఓదార్చండిఅదే  అమరజీవికి అర్ధవంతమయిన నివాళి

No comments