అంపశయ్య - అంపశయ్య నవీన్.


                      సామాజిక బాధ్యత కలిగిన రచన అంటే ఎలా ఉండాలిచదివిన తర్వాత మన మనసు మీద చెరగని ముద్ర వేయాలిపాఠకుడిలో ఒక సంఘర్షణ రేపాలిఏదో చేయాలన్న ఆరాటం.. ప్రపంచాన్ని మరమ్మత్తు చేసేయాలన్న తపన, ఆవేశం కలిగించాలిఒక్క మాటలో చెపాలంటే "అంపశయ్యలా ఉండాలిఅంపశయ్య!!దాదాపు 45 సంవత్సరాల క్రితం మొదటి సారిగా ప్రచురింపబడి ఇప్పటికి 8 సార్లు పునర్ముద్రింపబడి... వెలువడిన ప్రతీసారి మరల మరల చదివించిఆలోచింపచేసే నవల

2000 సంవత్సరం లో వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో అత్యంత ప్రభావం కలిగించిన పుస్తకాలు గుర్తించడానికి  ఆంధ్ర జ్యోతి పత్రిక ఒక బృహత్తర కార్యక్రమచేపట్టిందిహేమా హేమీ ల్లాంటి రచయితలైన అబ్బూరి ఛాయాదేవిరావూరి భరధ్వాజనండూరి రామ మోహన రావు మొదలైన వారితో ఒక కమిటీ వేసిందికన్యాశుల్కంచివరకు మిగిలేదిమహా ప్రస్థానంఅమృతం కురిసిన రాత్రి.. మైదానం... పుస్తకాల వరుస క్రమంలో 49 ఆణిముత్యం గా "అంపశయ్యగుర్తింపబడింది.
            తెలుగు సాహిత్యంలో చైతన్య స్రవంతి (స్ట్రీం ఆఫ్ కాన్షియస్నెస్అనే నూతన సాహితీ ప్రక్రియ వాడుకలోకే రాని రోజుల్లో అటువంటి శైలిని ఒక పూర్తి స్థాయి నవలలో సమర్ధవంతంగా వాడుకుని పాఠకుల మనసుల్ని దోచిన నవల అంపశయ్యచైతన్య స్రవంతి ప్రక్రియ అంటే రచనలో పాత్ర యొక్క అంతశ్చేతన కనబడడం(సబ్కాన్షియస్నెస్).. పాత్ర మనసులో జరిగే మధనం పాత్ర మాటల్లోనే వెలువడడం
1969 వెలువడిన  నవల పేరే  తర్వాత రచయిత నవీన్ ఇంటి పేరుగా నిలిచిపోయింది.

అంపశయ్య నవీన్ కధనంశైలి ఎంత గొప్పగా ఉంటాయంటేపుస్తకం చదివినంత సేపూ ఏదో భారమూతేలికతనమనిర్వేదమూఆనందమూ ఒకే సారి అనుభవంలోకి వస్తాయి పుస్తకం  మొదటి సారే కాదుచదివిన ప్రతీ సారీ ఇదే అనుభూతి కలగడం ఒక గొప్ప విషయం
        అంపశయ్య కధలో నాయకుడు రవిఒకానొక తెల్లవారుఝామున యూనివర్శిటీ హాస్టల్ గదిలో రవికి ఒక కల రావడంతో కధ మొదలవుతుంది కలకు అర్ధమేమిటో రవికి బోధపడదు కల నుంచి మేలుకున్న రవిలో మొదలైన ఆలోచనల ప్రవాహం నిరంతరంగా పరిగెడుతూ 18గంటల పాటు నడిచి చివరికి అదే గదిలోఆరాత్రి ముగుస్తుంది. 18 గంటల పాటు మాత్రమే నడిచ ఈకధ మనల్ని ఒక 20ఏళ్ళ యువకుడి అంతరంగ ఘోషలో ముంచేస్తుందితెరలు తెరలుగా పొరలు వీడి నగ్నంగా పరిగెత్తే అతని ఆలోచనలుఅతని ఊహలుపశ్చాత్తాపంఅతని ధర్మాగ్రహంపరిస్థితుల పట్ల అతని నిస్సహాయతజీవితంలో ఓటమిఅవమానం.. చిన్నిచిన్ని గెలుపులు.. అప్పటి అతని హృదయోల్లాసంమోహంఅశాంతిఅతని ఆకలిప్రేమ .... ఇంకా అతనిలో స్నేహంఅభిరుచులు.. అతని దుఃఖంఅంతే....
        అన్నీ అతడివేనవల అంతా రవిదే రవి మనసుదేనవల చదివాక మాత్రం అతనికి సంబధించిన  భావాలన్నీ మనవౌతాయిరవి మన మనసులో ఒక భాగం అయిపోతాడుఅంపశయ్యలో గొప్పతనం ఇదే
          కధ లోకి వస్తే,  రవి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాధారణ విద్యార్ధితల్లితండ్రులు చెమటోడ్చి పంపే డబ్బులతో ఉస్మానియాలో ఎమ్మే చదువుటుంటాడుతెలివైన వాడే అయినా పరీక్షలు దగ్గర పడే వరకూ చదవకుండా తిరిగేసి అవి ముంచుకొచ్చిన తర్వాత కొంచమైనా చదవలేకపోయాననే అపరాధభావనలో పడి కొట్టుకుంటూ ఉంటాడుదానికి తోడు ఇంటిదగ్గర రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు పంపే తల్లి తండ్రులువాళ్ళ కష్టాలు గుర్తొచ్చి కలవర పెడుతూ ఉంటాయిఒక పక్క చుటూ కనిపిస్తున్న రంగుల ప్రపంచంమరో పక్క విషాద నేపధ్యం...  రెండిటి మధ్య ఆశ నిరాశల ఆలోచనల్లో రవి ఈదుతూ... మనల్నిముంచెత్తుతాడు.
             రవి ఆలోచనా స్రవంతి ద్వారానే మిగిలిన పాత్రలను మనముదు ప్రవేశ పెడతారు రచయితడబ్బుతో మిడిసి పడే రెడ్డిఅతని మిత్ర బృందంఅభ్యుదయ వాదంతో మన రక్తం వేడెక్కించే వేణుప్రతినాయక ఛాయల్తో శ్రీశైలంయూనివర్శిటీ చదువు అయిపోగానే అమెరికా ఎగిరిపోవాలనుకునే అందమైన  డబ్బున్నఅమ్మాయి కిరణ్మయి.. రవి గత జీవితంలో అతనిపై ఆశలు పెంచుకుని నిరాకరింప భదిన అమాయకురాలు రత్తి... వీళ్ళందరినీ మన కళ్ళముందు సజీవంగా నిలబెడతారు రచయిత నవీన్రవిరత్తి ఒకరిని ఒకరు కోరుకుంటారుఅయితే ఆమెని వివాహం చేసుకునే ధైర్యం రవి చేయడువేరే వివాహం చేసుకున్నా రత్తి భర్తతోఉండలేక పోతుందిభర్తని వదిలేసి వచ్చిన రత్తి ఊఅర్లో గౌరవం నిలుపుకోలేక పోతుందిఆర్ధిక పరిస్థితులు వెంటబడుతుంటే ఒకానొక రోజు కన్న తండ్రే ఆమెని గోవిందరావనే ఒక భూస్వామికి ఆమెపై మనసుందని తెలిసి  అతని దగ్గరకి పంపిస్తాడుపరిస్థితులకు లొంగిపోయిన రత్తిలో సమాజం పట్ల ఒక ధిక్కారం మొదలవుతుంది.ఊరంతా ఆమె గురించి హేళనగా మాట్లాడుతుంటే ఆమె పరిస్థితికి తనే కారణమని రవి కృంగిపోతాడుఅయినా ఆమెకి న్యాయం చేయాలని అనుకోడుచివరికి ఆమెని ఒకరోజు తాను కూడా అనుభవిస్తాదుఅందరిలాగే  తర్వాత తాను కూడా ఆమె చేతిలో ఒక ఆఠణా పెడతాడుఅప్పుడు అరచేతిలో ఉన్న డబ్బుతో రత్తి అతని వైపుచూసిన చూపు.. అతనిని అగాధంలోకి తోసేస్తుందిచివరికి రత్తి ఊరినుంచి బహిష్కరింపబడినపుడు  అతనిలో మొదలైన అంతర్మధనమే కల రూపంలో నవల మొదట్లో కనిపిస్తుందిఊరంతా చిరిగిన బట్టల్తో ఉన్న రత్తిపై రాళ్ళు విసురుతుంటే ఒక పక్క జాలి పడుతూనే తాను కూడా ఒక రాయి వేసినట్లు వచ్చిన  కల అతనివాస్తవ మానసిక పరిస్థితిని మన కళ్ళముందుంచుతుంది.  మంచి చెడులు తెలుసుకునే విజ్ఞత అతనిలో ఉన్నా.. పరిస్థితులకు లొంగిపోయే అతని మానసిన దౌర్బల్యం అతని అంతశ్చేతనలో ఉండి  సంఘర్షణకు కారణం అవుతుంది
       రవికి కొంత మంది మంచి మిత్రులూ ఉంటారుధనమదం ప్రదర్శించే మరికొంత మంది విధ్యార్దులూ ఉంటారురవికి వాళ్ళంటే తగని అసహ్యంకాని వాళ్ళతో తల పడలేని బలహీనత అతడిదిధనంఅంగ బలం తెచ్చిన పొగరుతో వాళ్ళ వర్గం ఎప్పుడూ పై చేయిగా ఉంటుందిన్యాయం తమ వైపు ఉందని తెలిసినా గట్టిగాఅడగలేని పరిస్థితి రవి బృందానిదిరవి అంతర్మధనం రచయిత వర్ణించే తీరు మాటల్లో చెప్పలేం చదివి తీరాల్సిందేఒకానొక దుర్భల క్షణంలో వాళ్ళు మెచ్చేలా ఉండి తన డబ్బు అవసరాలు తీర్చుకుందామనీ అనుకుంటాడుకానీ ఆత్మాభిమానం కల వ్యక్తిగా ఆపని చేయలేడుఇలా ప్రతీ విషయంలోనూ ద్వైదీ భావంతో కొట్టుమిట్టాడుతూ మనల్నీ సంఘర్షణలో ముంచి లేపుతాడు రవికిరణ్మయితో ఒక్క సారైనా సినిమా చూడాలన్న క్షణికమైన ఆనందం కోసం అప్పు చేసి మరీ వెళ్ళన రవి అక్కడ జరిగిన ఒక అవమానంతో జ్ఞానోదయమై యూనివర్సిటీకి తిరిగి వస్తాడు రోజు ప్రతి నాయక బృందంతో జరిగిన ఘర్షణలో బలహీనులంతా ఏకమై రవితోపాటు వారిని ఎదుర్కోవడంతో కధ ముగుస్తుందిఅప్పటిదాకా తప్పొప్పుల సంఘర్షణలో ఉన్న రవి ఒక విశ్వాసంతో ముందడుగు వేయడంతో  అతని ప్రయాణం గమ్యం దిశగా  మొదలైందని మనకి అనిపిస్తుంది
         ఇదీ క్లుప్తంగా అంపశయ్య కధ.రక రకాల మనస్తత్వాల మధ్యఆశ నిరాశల మధ్య కొట్టు మిట్టాడే రవి జీవితంలో జరిగే కొద్దిగంటల కాలం  నవల  కానీ చైతన్య స్రవంతి అనే ప్రక్రియలో సాగే  నవల విశ్వరూపం మనకి చదివాక గాని అర్ధం కాదు.  

          లక్ష్యశుద్ధి లేని విద్యా విధానంచిత్తశుద్ధి లేని బోధనా పద్ధతులు , భవిష్యత్తుకి ఏమాత్రం గ్యారంటీ లేని పాలనసమస్త జీవన రంగాన్నీ కలుషితం చేసిన కృత్రిమ విలువలు విద్యార్ధులను  విధం గా నిర్వీర్యులుగా మార్చి పెడదారులు పట్టిస్తున్నదీ సమర్ధవంతం గా చెప్పిన నవల ' అంపశయ్య ' .. 

నవీన్  నవలని 1969లో రాసారుదాదాపు 45 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పూ రాలేదుయూనివర్సిటీ జీవితాలను కళ్ళకు కట్టిన నవల " అంపశయ్య".
మార్క్స్ నూమావోనువియత్నాం పోరాటాన్ని అభిమానిస్తూనేనెహ్రూ సోషలిజాన్ని , ప్రణాళికల్నీ బలపరచడమే వీటన్నిటికీ విరుగుడుగా భావించే అభ్యుదయ వాదులు ఇందులో మనకి పరిచయమై మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు.  అయితే కధా కాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే  మనకు సంశయనివృత్తి కలుగుతుంది.  
              మనసును కదిలించే ఎన్నో సన్నివేశాలు  కధలో ఉంటాయి . ముఖ్యం గా హాస్టల్ జీవితంరవి ఫ్లాష్బ్యాక్ ఎంతో సహజంగా ఉంటుందిమొదట్లో భయస్తుడూ ప్రతీ చిన్న విషయానికీ ఊగిసలాడే రవి చివరలో ఇలా అనుకుంటాడు, ” తనమీద దెబ్బ పడటంతను కూడా శతృవుని దెబ్బకొట్టటంతనలోని అత్మస్థైర్యాన్నిపెంచుతున్నదితను నమ్మిన భావం కోసం తను నమ్మిన ఆదర్శం కోసం , తన స్వాతంత్ర్య పరిరక్షణ కోసం ముందు ముందు ఇలాంటి దెబ్బలు ఎన్ని తినటానికి అయినా వెనుకాడడుఅందులో ఇవాళ్టి సంఘటన తనను పూర్తిగా సంసిద్ధుడిని చేసింది.” రవిలో ఇలాంటి పరివర్తన తీసుకుని రావడానికి రచయిత చైతన్య స్రవంతినిఎంతో చక్కగా వాడుకున్నారునవల చదివాక అలాంటి పిరికితనముంటే మనలో కూడా పరివర్తన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది
              అంపశయ్య చదివిన సాహితీ మిత్రులకు ఎవరికయినా .యు కాంపస్ లో  మూలో నిలబడి   18 గంటలూ రవిచే మనకు చెప్పించే విధానం కళ్ళ ముందు కదులుతుందంటే అతిశయోక్తి కాదురవి పాత్రతో పాటు మనం కూడా ఒక సిటీ బస్సెక్కి తార్నాకా , మౌలాలీ చుట్టి వచ్చేస్తాం పరిసర ప్రాంతాలలోనే రవి,వేణుసాగర్రెడ్డి కిరణ్మయి,  గోపీలు కనిపిస్తారామో అని వెతుకుతాంబయటకు వచ్చేసాక అక్కడెక్కడయినా రత్తి నిలబడి ఉందేమో అన్న ఆశతో చుట్టూ వెతుకుతాంఇది అంతా ఒక నోస్టాల్జిక్ ఊహ.  

No comments